ఎయిరిండియా విమానాలపై దుబాయ్‌ నిషేధం

19 Sep, 2020 08:30 IST|Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌ పాజిటివ్‌ సర్టిఫికెట్‌ కలిగి ఉన్న వ్యక్తులను ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాల ద్వారా దుబాయ్‌కి పంపినందుకుగానూ ఆ దేశం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానాలపై అక్టోబర్‌ 2 వరకూ నిషేధం విధిం చింది. యూఏఈ నిబంధనల ప్రకారం ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు ఉన్న సర్టిఫికెట్లను 96 గంటల ముందుగా తీసుకొని అక్కడకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే సెప్టెంబర్‌ 2న పాజిటివ్‌ ఉన్న ఓ వ్యక్తి సెప్టెంబర్‌ 4న జైపూర్‌ నుంచి దుబాయ్‌ వెళ్లాడని, గతంలోనూ ఇలాగే జరిగినందున నిషేధం విధించామని అధికారులు చెప్పారు.   బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కోవిడ్‌ రోగి పక్కన కూర్చొన్న వ్యక్తులను క్వారంటైన్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు