48 గంటల్లోనే హైవే కింద సొరంగం.. ఇది కదా మనకు కావాల్సింది.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్‌..

3 Mar, 2023 18:48 IST|Sakshi

డచ్ దేశం  నెదర్లాండ్స్‌లో ఒక్క వారాంతంలోనే హైవే కింద సొరంగం నిర్మించిన వీడియోను షేర్ చేశారు భారతవ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా. ఇలాంటి నైపుణ్యం కదా మనం సంపాందిచుకోవాల్సిందని కొనియాడారు. ఇది లేబర్‌ను తగ్గించుకోవడం కాదు.. సమయాన్ని ఆదా చేసుకోవడం అని చెప్పుకొచ్చారు.

అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలో ఇలా వేగంగా పనులు చేయడం కూడా చాలా కీలకమని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. వేగవంతమైన మౌలిక సదుపాయాల కల్పన అంటే వేగవంతమైన వృద్ధి, అందరికీ ప్రయోజనాలు చేకుర్చడం అని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు