ఫుడ్‌కోర్టులో ‘గుడ్డు’ వివాదం

21 Aug, 2022 15:09 IST|Sakshi

శివమొగ్గ(బెంగళూరు): శివమొగ్గ నగర పార్కు లేఔట్‌ ప్రధాన రోడ్డులో వెజ్‌ ఫుడ్‌ కోర్టు (శాఖాహార)లో గుడ్లకు సంబంధించిన ఆహార విక్రయంపై గొడవ జరిగింది. వ్యాపారస్తులు బాహాబాహీకి కూడా దిగాల్సి వచ్చింది. శనివారం వెజ్‌ఫుడ్‌ కోర్టులో గుడ్డుతో తయారు చేసిన ఆహారాన్ని విక్రయించారు.

దీనికి కొందరు మరికొందరు ఆక్షేపణ వ్యక్తం చేశారు. వెజ్‌ఫుడ్‌ కోర్టులో గుడ్డుతో తయారు చేసిన ఆహారాన్ని విక్రయించేందుకు అవకాశం లేదని గొడవకు దిగారు. ఇదే విషయంపై శివమొగ్గ మహానగర పాలికెకు కొందరు ఫిర్యాదు చేశారు. 

చదవండి: మొబైల్‌ చార్జర్‌ మాదిరిగా ఉండే స్పై కెమెరాను అమర్చి..

మరిన్ని వార్తలు