స్థానికుల భయం: సైకిల్‌ మీద శవాన్ని..

17 Aug, 2020 17:59 IST|Sakshi
వీడియో దృశ్యం

బెంగళూరు : చనిపోయిన వ్యక్తిని శ్మశానానికి తరలించేందుకు స్థానికులు సహకరించకపోవటంతో మృతుడి కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. సైకిల్‌పైనే శవాన్ని కాటికి చేర్చింది. ఈ హృదయ విదారకర ఘటన కర్ణాటకలోని బెలగావి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. బెలగావి జిల్లా కిత్తూరు‌ తాలూకా ఎమ్‌కే హుబ్బలికి చెందిన ఓ వ్యక్తి కొద్దిరోజుల క్రితం చనిపోయాడు. ( గంటన్నర టెన్షన్‌ )

అతడు కరోనా వల్లే చనిపోయాడని భావించిన స్థానికులు అంత్యక్రియలకు దూరంగా ఉండిపోయారు. దీంతో మృతుడి కుటుంబం సైకిల్‌పైనే శవాన్ని శ్మశానానికి చేర్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ ఈ సోమవారం తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేయటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ( ఏం చేస్తున్నావు? నేను చూసేశాను!)

>
మరిన్ని వార్తలు