Nirmala Sitharaman Health: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చేరిక

27 Dec, 2022 09:08 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(63) అస్వస్థతకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఆమె చేరారు. అయితే ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిందేమీ లేదని అధికారిక వర్గాలు తెలిపాయి.

వైరల్‌ ఫీవర్, పొట్టలో ఇన్ఫెక్షన్‌ కారణంగానే నిర్మాలా సీతారామన్ ఆస్పత్రిలో చేరారని అధికారులు పేర్కొన్నారు. వైద్యులు ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. 

నిర్మలా సీతారామన్ ఆదివారం బాగానే ఉన్నారు. మాజీ ప్రధాని, బీజేపీ దిగ్గజ నేత వాజ్‍పేయీ జయంతి సందర్భంగా నివాళులు కూడా అర్పించారు. కానీ ఆ మరునాడే ఆమె అనారోగ్యానికి గురయ్యారు.
చదవండి: రాహుల్ స్పీచ్‌లు చూసి వాళ్లు భయంతో వణికిపోతున్నారు: సీఎం స్టాలిన్

మరిన్ని వార్తలు