శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

13 Mar, 2021 15:12 IST|Sakshi

డెహ్రాడూన్‌: శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని కాన్స్రో సమీపం వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా సి-4 బోగీలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. కాగా, ప్రమాదం జరిగిన విషయాన్ని వెంటనే గ్రహించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం నుంచి అంతా సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ఈ బోగీలోని ప్రయాణికులందరిని సురక్షితం తరలించామని, వారికి ఎటువంటి గాయాలు సంభవించలేదని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. 

మరిన్ని వార్తలు