జమ్మూ కశ్మీర్‌: ఆస్పత్రిలోకి చొరబడి ఉగ్రదాడి

5 Nov, 2021 16:14 IST|Sakshi

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రదాడి చోటు చేసుకుంది. శ్రీనగర్‌లోని ఎస్‌కేఐఎంఎస్‌ ఆస్పత్రిలోకి ఉగ్రవాదులు చొరబడ్డారు. ఆస్పత్రి సమీపంలో భద్రతా దళాలపై ఉగ్రవాదుల కాల్పులకు తెగపడ్డారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా దళాలు యత్నిస్తున్నారు. ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని శ్రీనగర్‌ పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు