Odisha Road Accident Today: భయానక రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి 

28 Aug, 2022 08:51 IST|Sakshi

ఫుల్‌ స్పీడ్‌లో ఉన్న ఓ ట్రక్కు.. ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. డెంకానల్‌ జిల్లాలోని కామక్యానగర్‌లో ఆదివారం తెల్లవారుజామున ఓ ట్రక్కు.. ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో మైనర్​ సహా ఐదుగురు మృతి చెందారు. కాగా, మృతులంతా బంగూర గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఆటోలో పని నిమిత్తం ముక్తపేసి ప్రాంతానికి వెళ్తున్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు