karnataka: గుండెపోటుతో మాజీ ఉపాధ్యక్షుడి మృతి

17 Nov, 2021 06:31 IST|Sakshi

సాక్షి, రాయచూరు(కర్ణాటక): రాయచూరు నగరసభ మాజీ ఉపాధ్యక్షుడు, బీజేపీ నేత దొడ్డమల్లేశ్‌ (50) గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం ఉదయం వాకింగ్‌ వెళ్లే సమయంలో ఆకస్మికంగా గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

రెండుసార్లు నగరసభ సభ్యుడిగా, బీజేపీ నగర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన మృతి పట్ల నగరసభ అధ్యక్షుడు వినయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి, పలువురు సంతాపం వ్యక్తం చేశారు.    

మరిన్ని వార్తలు