మాజీ గవర్నర్‌ అశ్వనీకుమార్‌ ఆత్మహత్య

7 Oct, 2020 21:04 IST|Sakshi

సిమ్లా : సీబీఐ మాజీ డైరెక్టర్‌, నాగాలాంగ్‌ మాజీ గవర్నర్‌ అశ్వనీకుమార్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సిమ్లాలోని తన ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు సిమ్లా ఎస్పీ మెహిత్‌ చావ్లా వెల్లడించారు. అశ్వనీకుమార్‌ 2006 నుంచి 2008 వరకు హిమాచల్‌ ప్రదేశ్‌ డీజీపీగా పనిచేశారు. అనంతరం 2008 ఆగస్ట్‌ నుంచి 2010 నవంబర్‌ వరకు సీబీఐ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సిఉంది.

మరిన్ని వార్తలు