బీజేపీలోకి కెప్టెన్‌ అమరీందర్‌.. పార్టీ కూడా విలీనం

17 Sep, 2022 16:31 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ (పీఎల్‌సీ) చీఫ్‌ కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ (80) వచ్చే వారం బీజేపీలో చేరనున్నారు. పీఎల్‌సీని బీజేపీలో విలీనం చేయనున్నారు. ఫిబ్రవరిలో జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పీఎల్‌సీ, బీజేపీ, సుఖ్‌దేవ్‌ సింగ్‌ నేతృత్వంలోని అకాలీదళ్‌తో కలిసి పోటీ చేయడం, అమరీందర్‌ ఓడిపోవడం తెలిసిందే. 

చదవండి: (బీజేపీ హర్ట్ అయ్యింది.. కారణం ఇదే: కేజ్రీవాల్)

>
మరిన్ని వార్తలు