ఆరు వేల రైల్వే స్టేషన్‌లలో ఉచిత వై-ఫై

16 May, 2021 18:07 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే మరో మైలురాయిని అందుకుంది. డిజిటల్‌ ఇండియాలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఉచిత వై-ఫై సేవలు ఇప్పటి వరకు 6 వేల స్టేషన్లకు విస్తరించాయి. జార్ఖండ్‌లోని హజారిబాగ్ టౌన్‌లో శనివారం ఈ సౌకర్యం కల్పించడంతో రైల్వే 6 వేల స్టేషన్‌లలో ఉచిత వై-ఫై సేవలు అందిస్తున్నట్లు జాతీయ రవాణా సంస్థ తెలిపింది. 2016లో ముంబై రైల్వే స్టేషన్‌లో మొట్ట మొదట ఉచిత వై-ఫై సదుపాయాన్ని కల్పించారు. పశ్చిమ బెంగాల్‌లోని మిదాన్‌పూర్ స్టేషన్‌లలో ఉచిత వై-ఫై సేవలు అందించి 5,000 మార్కును అందుకుంది.

అలాగే, మే 15 న ఒడిశాలోని అంగుల్ జిల్లాలోని జరపాడ స్టేషన్‌కు కూడా వై-ఫై సౌకర్యం కల్పించినట్లు ఆదివారం తెలిపింది. "డిజిటల్‌ ఇండియాలో కార్యక్రమం కిందదేశంలోని రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై సౌకర్యం" కల్పిస్తున్నారు. దీని వల్ల గ్రామీణ పట్టణ పౌరుల మధ్య డిజిటల్ అంతరం తగ్గుతుంది. తద్వారా గ్రామాల్లో డిజిటల్ మీద అవగాహన పెరుగుతుంది అని అని రైల్వే శాఖ తెలిపింది. "భారతీయ రైల్వేలు ఇప్పుడు 6,000 స్టేషన్లలో వై-ఫై సౌకర్యాన్ని అందిస్తున్నాయి" అని తెలిపింది. రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని పీఎస్‌యు రైల్‌టెల్ సహాయంతో రైల్వేలకు ఎటువంటి ఖర్చు లేకుండా స్టేషన్లలో వై-ఫై సౌకర్యాలు కల్పిస్తున్నారు. గూగుల్, డాట్(యుఎస్‌ఓఎఫ్ కింద), పీజిసీఐఎల్, టాటా ట్రస్ట్ భాగస్వామ్యంతో ఈ పని చేపట్టినట్లు తెలిపింది.

చదవండి:

5.5 కోట్ల యూజర్లకు ఎయిర్‌టెల్‌ బంపర్‌ ఆఫర్‌

మరిన్ని వార్తలు