మహాత్మా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి కల్యాణం కన్నుమూత

5 May, 2021 08:40 IST|Sakshi

సాక్షి, చెన్నై: మహాత్మా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి వి.కల్యాణం (99) మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. స్వాతంత్య్ర సమరయోధుడైన కల్యాణం, 1943 నుంచి 1948 వరకు మహాత్మాగాంధీ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. చెన్నైలోని కుమార్తె ఇంట్లో ఉంటున్న ఆయన వయోభారం, అనారోగ్య సమస్యలతో మంగళవారం రాత్రి కన్నుమూశారు. బుధవారం చెన్నై బీసెంట్‌ నగర్‌ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. 
చదవండి: ప్రముఖ సామాజిక కార్యకర్త, ట్రాఫిక్ రామస్వామి ఇకలేరు

మరిన్ని వార్తలు