మళ్లీ జైలుకు: కరోనాతో కోలుకున్న గ్యాంగ్‌స్టర్‌ చోటా రాజన్‌

12 May, 2021 14:29 IST|Sakshi

ఢిల్లీ: కరోనా బారిన పడిన గ్యాంగ్‌స్టర్‌ చోటా రాజన్‌ కోలుకున్నాడు. అతడు కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. అతడి ఆరోగ్యం మెరుగవడంతో అధికారులు ఢిల్లీ ఎయిమ్స్‌ నుంచి తిహార్‌ జైలుకు తరలించారు. ఏప్రిల్‌ 22వ తేదీన చోట రాజన్‌ కరోనా వైరస్‌ బారినపడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే ఆ నెల 24వ తేదీన ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు.

అయితే చికిత్స పొందుతున్న సమయంలో ఒక్కసారిగా చోట రాజన్‌ మృతి చెందాడనే వార్తలు గుప్పుమన్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చోటా రాజన్‌ మృతి చెందారనే వార్త వైరల్‌గా మారింది. ఈ పుకార్లపై పోలీస్‌, ఆస్పత్రి అధికారులు స్పందించి ‘లేదు.. లేదు. చోట రాజన్‌ చనిపోలేదు. చికిత్స పొందుతున్నాడు’ అన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. చివరకు ఆయన కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యంతో తిహార్‌ జైలుకు తిరిగి వెళ్లాడు.

చదవండి: మృత్యుఘోష: బాంబుల మోతతో దద్దరిల్లిన గాజా

చదవండి: దారుణం.. వేశ్యను వాడుకుని డ్రైనేజీలో పారవేత

మరిన్ని వార్తలు