న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతోంది. చిన్నపెద్దా తేడాలేకుండా చాలా మంది కరోనా కారణంగా తమ ప్రాణాలను కోల్పోతున్నారు. భవిష్యత్ తరాలను తీర్చిదిద్దాల్సిన యువత ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం. ‘లేవండి.. మేల్కోండి.. గమ్యం చేరేవరకు విశ్రమించకండి’ వంటి వివేకానంద సూక్తులు ఇప్పటికీ ఎంతోమంది యువతకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. అయితే ఆ వజ్ర సంకల్పం విధి ఆడే ఆటలో నేలకొరిగింది.
ఢిల్లీకి చెందిన ఓ 30 సంవత్సరాల యువతి కరోనా కారణంగా తన ప్రాణాలను కోల్పోయింది. కోవిడ్ చికిత్స సమయంలో 2016లో వచ్చిన షారుఖ్ ఖాన్, అలియా భట్.. ‘‘డియర్ జిందగీ’’ సినిమాలోని పాటలు వింటున్న యువతి వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. మహమ్మారిబారిన పడినా కూడా ఎంతో ధైర్యంగా, దాని నుంచి బయటపడతాననే నమ్మకం ఆమె ముఖంలో కనిపించడం పలువురిలో స్ఫూర్తిని నింపింది. అయితే సదరు యువతి కరోనాతో పోరాడుతూ మరణించినట్లు డాక్టర్ మోనికా లాంగే ట్విటర్లో పేర్కొన్నారు. ‘‘దురదృష్టవశాత్తు ఓ ధైర్యవంతురాలిని కోల్పోయాం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి’’ అంటూ డాక్టర్ లాంగే గురువారం ట్వీట్ చేశారు.
ఆ యువతి మరణ వార్తను ట్వీట్ చేయడానికి ముందు లాంగే మే10న ఆమె చికిత్సకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. ‘‘ఆమెకు ఐసియు బెడ్ దొరికింది. దయచేసి ఆ యువతి కోసం ప్రార్థించండి. మన ఆలోచనలు, మన ప్లానింగ్స్తో కొన్నిసార్లు ఏం చేయలేం. అంతా ఆ దేవుడి చేతుల్లోనే ఉంది.’’ అంటూ ట్వీట్ చేశారు. కాగా దీనిపై సోనూ సూద్ స్పందిస్తూ.. ‘‘ఇది బాధాకరమైన ఘటన. ఆమె తన కుటుంబాన్ని మళ్లీ చూడదని ఊహించలేదు. చాలా మంది జీవితాలు అర్థాంతరంగా ముగుస్తున్నాయి. ఇది చాలా అన్యాయం’’ అంటూ రాసుకొచ్చారు. నెటిజన్లు సైతం యువతి మరణం పట్ల సానుభూతి తెలియజేస్తున్నారు.
(చదవండి: కుటుంబాన్ని చిదిమేసిన కరోనా: నలుగురు మృతి)
She is just 30yrs old & She didn't get icu bed we managing her in the Covid emergency since last 10days.She is on NIVsupport,received remedesvir,plasmatherapy etc.She is a strong girl with strong will power asked me to play some music & I allowed her.
— Dr.Monika Langeh🇮🇳 (@drmonika_langeh) May 8, 2021
Lesson:"Never lose the Hope" pic.twitter.com/A3rMU7BjnG