హారన్‌ కొడితే తప్పుకోలేదని.. బధిరుడిని కత్తితో పొడిచి చంపిన బాలిక

26 Jul, 2022 06:56 IST|Sakshi

రాయ్‌పూర్‌: పదేపదే హారన్‌ కొట్టినా తన స్కూటీకి దారివ్వలేదని ఆగ్రహించిన ఓ బాలిక సైకిల్‌పై వెళ్తున్న బధిరుడిని కత్తితో పొడిచి చంపేసింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రాయ్‌పూర్‌లోని కంకాలిపార ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. బాలికను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ బాలిక(15) తన తల్లిని తీసుకుని స్కూటీపై వెళుతోంది. సైకిల్‌ తొక్కుకుంటూ ముందు వెళ్తున్న సదామా లదేర్‌(40) అడ్డురావడంతో హారన్‌ కొట్టింది. బధిరుడైన సుదామ హారన్‌ వినిపించక పక్కకు తప్పుకోలేదు. హారన్‌ ఎన్నిసార్లు మోగించినా నిర్లక్ష్యంగా వెళ్తున్నాడనే కోపంతో బాలిక స్కూటీని ఆపి, అతడిపై కేకలు వేసింది. ఆపైన తన వద్ద ఉన్న చాకుతో అతడి మెడపై పొడిచింది. అనంతరం తల్లిని అక్కడే వదిలేసి స్కూటీతో పరారైంది. తీవ్ర రక్తస్రావమైన సుదామ ఆస్పత్రికి వెళ్లేలోగానేతీసుకెళ్తుండగానే చనిపోయాడు.

ఇదీ చదవండి: జ్యూస్‌లో మత్తు మందు కలిపి అత్యాచారం

మరిన్ని వార్తలు