హిజాబ్‌ ధరించారని క్లాస్‌లోకి రానివ్వలేదు

2 Jan, 2022 07:33 IST|Sakshi

మంగళూరు (కర్ణాటక): హిజాబ్‌(తలపై ధరించే వస్త్రం)ను ధరించారనే కారణంగా కర్ణాటకలోని ఒక ప్రభుత్వ ప్రీ–యూనివర్సిటీ కాలేజీలో ఆరుగురు ముస్లిం విద్యార్థినులను తరగతి గదిలోకి అనుమతించ లేదు. ఈ ఘటన ఉడుపిలోని గవర్నమెంట్‌ ఉమన్స్‌ పీయూ కాలేజీలో జరిగింది. తమను ఉర్దూ, అరబిక్‌ భాషల్లో మాట్లాడేందుకు కాలేజీ ప్రిన్సిపాల్‌ అనుమతించట్లేదని, క్లాస్‌లోకి రానివ్వలేదని ఆరోపించారు. కాలేజీ ప్రాంగణంలో హిజాబ్‌ను అనుమతిస్తామని, క్లాస్‌రూమ్‌లో కుదరదని ప్రిన్సిపల్‌ రుద్ర గౌడ స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు