పార్లమెంట్‌కు చేరిన ‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’ 

18 Sep, 2020 04:24 IST|Sakshi
మొక్కతో సెల్ఫీ దిగుతున్న సంతోష్, ఓం బిర్లా 

సాక్షి, న్యూఢిల్లీ: గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా పార్లమెంట్‌ ఆవరణలో లోక్‌సభ సభాపతి ఓంబిర్లా రుద్రా క్ష మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ రూపకర్త, రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్, టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రీన్‌ చాలెంజ్‌ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్లడం కోసం పార్లమెం టు వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

>
మరిన్ని వార్తలు