Maharashtra: చానుమాన్‌ చాలీసా ఛాలెంజ్‌.. ఎట్టకేలకు నవనీత్‌ కౌర్‌ దంపతులకు బెయిల్‌

4 May, 2022 11:45 IST|Sakshi
నవనీత్‌ కౌర్‌, రవి రానా (పాత ఫొటో)

ముంబై: మహారాష్ట్ర ఎంపీ నవనీత్‌ కౌర్‌ రానా, ఆమె భర్త రవి రానాలకు ఊరట లభించింది. అరెస్ట్‌ అయ్యి జైల్లో ఉన్న ఆ జంటకు ఎట్టకేలకు బెయిల్‌ లభించింది. బుధవారం షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది సెషన్స్‌ కోర్టు. 

సీఎం ఉద్దవ్‌ థాక్రే ఇంటి ముందు హనుమాన్‌ చాలీసా పఠిస్తామంటూ ముంబైలో ఉద్రిక్తతలకు కారణం అయ్యారు ఈ ఇండిపెండెంట్‌ ఎంపీ, ఎమ్మెల్యే భార్యాభర్తలు. ఈ తరుణంలో ఏప్రిల్‌ 23వ తేదీన ఖర్‌ స్టేషన్‌ పోలీసులు వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత బైకులా జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఈ జంట బెయిల్‌ కోసం ప్రయత్నిస్తూనే ఉంది.

బుధవారం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన ముంబై సెషన్స్‌ కోర్టు.. మీడియాతో మాట్లడవద్దని నవనీత్‌ కౌర్‌ దంపతులను ఆదేశించింది.

చదవండి: ఎస్సీ కావడంతో నాకు నీళ్లు కూడా ఇవ్వలేదు: నవనీత్‌ కౌర్‌

మరిన్ని వార్తలు