హరియాణా ఆవిర్భావ దినోత్సవం: ఖైదీలకు సీఎం ఖట్టర్‌ తీపికబురు

1 Nov, 2021 19:50 IST|Sakshi

చండీగఢ్‌: హరియాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ రాష్ట్రంలోని.. వివిధ జైళ్లలో శిక్షలను అనుభవిస్తున్నవారికి తీపికబురు అందించారు. ​ఇప్పటికే.. జైళ్లలో లేదా పెరోల్‌పై ఉన్న సుమారు 250 మంది నిందితులకు క్షమాభిక్ష ఇస్తున్నట్లు ప్రకటించారు.

శిక్షాకాలంలో 6 నెలలు, అంతకన్నా తక్కువ కాలం ఉన్న నిందితులకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపారు. అయితే, క్రూరమైన నేరాలకు పాల్పడి శిక్షలు అనుభవిస్తున్న వారికి మాత్రం ఇది వర్తించదని సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ స్పష్టం చేశారు.

చదవండి: బస్సు లోయలో పడిన ఘటన: బాధిత కుటుంబాలకు రూ.లక్ష పరిహారం

మరిన్ని వార్తలు