సెకండ్​వేవ్​: లాక్​డౌన్​ పొడిగించిన మరో రాష్ట్రం

30 May, 2021 14:59 IST|Sakshi

చండీఘడ్‌: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. ఇప్పటికే ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి అనేక రాష్ట్రాలు లాక్​డౌన్​ను విధించాయి. అయితే, ఇప్పుడిప్పుడే పాజిటివ్​ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. ఈ క్రమంలో అనేక రాష్ట్రాలు మరికొన్ని రోజులు లాక్​డౌన్​ను పొడిగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, హరియాణా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ ఖట్టర్ కూడా లాక్​డౌన్​ను  జూన్​ 7 వరకు పొడిగిస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన వీడియో కాన్ఫరేన్స్​ సమావేశంలో విలేకరులతో మాట్లాడారు. ​రాష్ట్రంలో కోవిడ్​ కేసుల సంఖ్య అదపులోనే ఉందని అన్నారు.  ఈ వైరస్​ వ్యాప్తిని మరింత కట్టడి చేయడానికి మరికొంత కాలం లాక్​డౌన్​ అవసరమని పేర్కొన్నారు.  ఈ క్రమంలో కొన్నినూతన సడలింపులను జారీ చేశారు. దీని ప్రకారం... ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు షాపులు పనివేళలని తెలిపారు. అదే విధంగా.. ఇకమీదట దుకాణ యజమనులు సరి‌‌‌‌‌‌,బేసి నియమాలను పాటిస్తూ దుకాణాన్ని తెరుచుకోవాలని అన్నారు.

అయితే, కొన్ని మాల్స్​లలో మాత్రం ఉదయం 10 గంటల నుంచి సాయత్రం 6 గంటల వరకు తెరవడానికి ప్రత్యేకంగా అనుమతిస్తున్నామని తెలిపారు. అయితే, వీటిలో ఒకేసరి సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మాల్ యజమానులకు ఆదేశాలను జారీ చేశారు. అయితే,  కర్య్ఫూ మాత్రం యధావిధిగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు  కొనసాగుతుందని తాజా ఉత్తర్వులలో పేర్కొన్నారు. అన్నిరకాల విద్యాసంస్థలు  జూన్ 15 వరకు మూసివేయబడి ఉంటాయని తెలిపారు. ప్రతి ఒక్కరు కొవిడ్​ నిబంధనలను పాటించాలని కోరారు. అదే విధంగా వ్యాక్సిన్​ కూడా వేసుకోవాలని పేర్కొన్నారు.  

కాగా.. శనివారం ఒక్క రోజే 1,868 కొత్తగా కరోనా కేసులు నమోదుకాగా, 97 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకుఈ మహమ్మారి​ కారణంగా 8,132 మంది చనిపోయారు. కాగా, ఇప్పటి వరకు హరియాణాలో 7,53,937 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో 23,094 కేసులు ఆక్టివ్​గా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు