5 రోజుల్లో కరోనాకు చెక్‌.. డీసీజీఏ అనుమతి కోరిన హెటిరో

9 Jul, 2021 14:41 IST|Sakshi

న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన ఔషధ తయారీ సంస్థ హెటిరో కరోనా చికిత్సలో అత్యవసర వినియోగం కింద మోలినో ఫెరివిర్‌ వాడకానికి శుక్రవారం డీసీజీఏ  అనుమతి కోరింది. టాబ్లెట్ రూపంలో అందుబాటులోకి రానున్న మోలినో ఫెరివిర్‌ 5 రోజుల్లో కరోనాను తగ్గిస్తుందని హెటిరో సంస్థ వెల్లడించింది. ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఈ టాబ్లెట్ వలన కొవిడ్‌ బాధితులు కోలుకున్నారని హెటిరో తెలిపింది. మోలినో ఫెరివిర్‌ అమెరికాలోని మెర్క్ షార్ప్ & డోహ్మ్ కార్పొరేషన్‌ సంయుక్తంగా  అభివృద్ధి చేస్తున్న  ఔషధం.

ఈ ఏడాది ఏప్రిల్ లో, హెటిరో భారతదేశంలో మోలినో ఫెరివిర్‌ తయారీ, సరఫరా చేయడానికి మెర్క్ షార్ప్ & డోహ్మ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఫేజ్-3 ట్రయల్ తాత్కాలిక డేటా ప్రకారం ఈ టాబ్లెట్ వలన కోవిడ్‌ లక్షణాలతో తక్కవగా  ఆసుపత్రిలో చేరుతున్నట్లు తెలిపింది.

మరిన్ని వార్తలు