ఘోర రోడ్డు ప్రమాదం: బస్సు బోల్తా.. 10 మంది మృతి

19 Mar, 2022 10:55 IST|Sakshi

కర్ణాటక: పావగడ వద్ద ఘరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ బస్సు బోల్తా పడటంతో 10 మంది మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. వైఎన్‌ఎస్‌ కోట నుంచి పావగడకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని పావగడ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది వరకు ఉన్నట్టుగా సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
చదవండి: రెండో పెళ్లి.. అడిగిన డబ్బులు తేకుంటే మొదటి భార్యను తీసుకొస్తానని..

మరిన్ని వార్తలు