మీరు ఇంకా పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయలేదా? అయితే, వెంటనే చేయండి లేకపోతే ఏప్రిల్ 1 నుంచి మీ పాన్ కార్డ్కు ఎలాంటి విలువ ఉండదు. పాన్ నెంబర్ ను ఆధార్ నెంబర్ తో లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా కోరుతున్నది. అనేకసార్లు చివరి తేదీని పొడగించిన ప్రస్తుతం మరోసారి పొడిగించే దాఖలాలు కనబడటం లేదు. ప్రస్తుతం పాన్, ఆధార్ నెంబర్లను లింక్ చేయడానికి నేడు (2021 మార్చి 31) చివరి తేదీ. ఈ రాత్రిలోగా మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేయాల్సిందే. లేకపోతే మీ దగ్గర పాన్ కార్డ్ ఉన్నా లావాదేవీల కోసం వాడుకోలేరు. ఒకవేళ మీరు గడువు తర్వాత పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్ చేసినట్టైతే రూ.1,000 లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని లోక్సభలో ప్రవేశపెట్టిన ఫైనాన్స్ బిల్ 2021 లో నిబంధనను విధించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే పాన్ కార్డుకు - ఆధార్ లింక్ చేసినట్లయితే ఈ-ఫైలింగ్ పోర్టల్ లింకు క్లిక్ చేసి ఆధార్, పాన్ నెంబర్ సమర్పించి స్టేటస్ తెలుసుకోవచ్చు.
ఆధార్-పాన్ లింక్ విధానం:
చదవండి: