న్యూఢిల్లీ: 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ కోవిడ్-19 టీకా తీసుకోవడం కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను కేంద్రం నిన్న ప్రారంభించింది. రిజిస్టర్డ్ చేసుకున్న లబ్ధిదారులకు టీకాలు వేయడం మే 1 నుంచి ప్రారంభంకానుంది. ఇంకా కోవిడ్ టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోక పోతే కోవిన్ ఆన్లైన్ పోర్టల్(cowin.gov.in), ఆరోగ్య సేతు యాప్, ఉమాంగ్ యాప్ ద్వారా మీ పేరు నమోదు చేసుకోవచ్చు. కోవిడ్-19 టీకా కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభించిన రోజున 1.32 కోట్లకు పైగా ప్రజలు తమ పేరును నమోదు చేసుకున్నారు.
రిజిస్ట్రేషన్ తర్వాత ఏమి చేయాలి?
ఒకే మొబైల్ నంబర్ ఉపయోగించి నలుగురు వ్యక్తులు కోవిడ్ -19 టీకా కోసం నమోదు చేసుకోవచ్చు. మీరు ఉమ్మడి టీకా కోసం నమోదు చేసుకుంటే, వేర్వేరు వయసుల క్రిందకు వచ్చే టీకాలు పొందాలనుకునే వారు, అంటే 45 కంటే ఎక్కువ లేదా అంతకంటే తక్కువ(18-44 వయస్సు) గల వారు, మీరు మీ టీకా కేంద్రాన్ని జాగ్రత్తగా ఎన్నుకోవాలి. కేంద్ర ప్రభుత్వం టీకా కేంద్రాల వద్ద 45 ఏళ్లు పైబడిన లబ్ధిదారులకు మాత్రమే టీకాలు వేస్తుంది. మిగతా వారికీ మే 1 నుంచి అనేక రాష్ట్రాలు టీకా కేంద్రాలలో ఉచిత టీకాలు వేస్తున్నట్లు ప్రకటించాయి. మీ రాస్ట్రంలో అలాంటి ప్రభుత్వ టీకా కేంద్రం లేకపోతే, మీరు ప్రైవేట్ ఆసుపత్రులలో డబ్బులు చెల్లించి టీకాల కోసం వేసుకోవాల్సి ఉంటుంది.
చదవండి: