స్వాతంత్య సమరయోధుల త్యాగాలను మరిచిపోలేం: రాష్ట్రపతి

14 Aug, 2021 19:29 IST|Sakshi
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

సాక్షి, న్యూఢిల్లీ: దేశ సాతంత్ర్య సమరయెధుల త్యాగాలను మరిచిపోలేమని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌ విజేతలను అభినందించారు.

కరోనాపై పోరు ఇంకా ముగియలేదని, కోవిడ్‌ను ఎదుర్కోవడంలో వ్యూహాత్మకంగా వ్యవహరించామని తెలిపారు. దేశవ్యాప్తంగా 50 కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. కష్టకాలంలోనూ వ్యవసాయరంగంలో పురోగతి సాధించామని రాష్ట్రపతి తెలిపారు.

మరిన్ని వార్తలు