భరతమాత స్వేచ్ఛ కోసం పోరాటం చేసి ఎందరో మహానుభావులు ప్రాణాలు విడిచారు. వారు కోరుకున్నదల్లా సంకెళ్లతో బంధింపబడని భావితరాన్ని.. అందుకే ఆరాటపడ్డారు.. పోరాటం చేశారు.. ప్రాణాలు విడిచారు. అమర వీరుల వందల ఏళ్ల పోరాటంతో బానిస సంకెళ్లు తెంచుకున్న భారతావనిలో నేటి తరం వారికి ఎలాంటి గౌరవం ఇస్తోంది.. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు ఎలాంటి అర్థం చెబుతోంది?.. అమర వీరుల ఆశయసాధనకు కృషి చేస్తోందా?..