తాలిబాన్లు అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్లోకి ప్రవేశించి ఆ దేశాన్ని ఆక్రమించుకోవడంతో అక్కడ ఉన్న ప్రజల్లో ఆందోళన మొదలైంది. అఫ్గనిస్తాన్లో ఉన్న ప్రస్తుత పరిస్థితిల వల్ల భారతదేశంలోకి ప్రవేశించాలని అనుకుంటున్న ఆఫ్ఘన్ జాతీయుల దరఖాస్తులను వేగంగా ట్రాక్ చేయడానికి భారతదేశం కొత్త కేటగిరీ ఈ-వీసాను ప్రవేశపెట్టింది. ఈ వీసాలు కేవలం ఆరు నెలలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. సెక్యూరిటీ క్లియరెన్స్ తర్వాత మాత్రమే వీసాలు మంజూరు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వీసా దరఖాస్తులను వేగంగా ట్రాక్ చేసే లక్ష్యంతో భారతదేశం"ఈ-ఎమర్జెన్సీ ఎక్స్-మిస్క్ వీసా" అనే కొత్త కేటగిరీ ఎలక్ట్రానిక్ వీసాను ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రానిక్ వీసా ఎలా దరఖాస్తు చేసుకోవాలో క్రింద తెలుసుకోండి.
ఈ-వీసా దరఖాస్తు విధానం
#India has just started an e-visa for #Afghanistan.
Visa category is "Emergency X-Misc Visa"
Upon selecting "Afghanistan" in the drop down, the "e-Emergency X-Misc Visa" category checkbox automatically shows pic.twitter.com/NbhvpwAAPl
— Rajeshwari (@rajeshwarie) August 17, 2021
ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న వారి కోసం ఎంఈఏ హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసింది. ఇతర అభ్యర్థనల కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఆఫ్ఘనిస్తాన్ సెల్ ఏర్పాటు చేసి౦ది. ఎంఈఏ ప్రతినిధి అరిందమ్ బాగ్చి హెల్ప్ లైన్ నంబర్-919717785379, ఈ-మెయిల్- MEAHelpdeskIndia@gmail.com ట్విట్టర్ లో ప్రకటించారు.
#MEA has set up a Special Afghanistan Cell to coordinate repatriation and other requests from Afghanistan.
Pls contact :
Phone number: +919717785379
Email: MEAHelpdeskIndia@gmail.com@IndianEmbKabul
— Arindam Bagchi (@MEAIndia) August 16, 2021