సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 26,567 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా గత అయిదు నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 97,03,770కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. చదవండి: హైదరాబాద్లో కరోనా సెకండ్ వేవ్ కలకలం
దీని ప్రకారం.. సోమవారం కొత్తగా 385 మరణాలు సంభవించగా.. ఇప్పటి వరకు 1,40,958 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 39,045 మంది కోలుకోగా, మొత్తం కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 91,78,946గా ఉంది. ప్రస్తుతం 3,83,866 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 94.59 శాతానికి పెరిగింది.