35 దేశాల్లో భారత్‌కు ఆరో స్థానం

27 Oct, 2020 09:30 IST|Sakshi
ఫైల్ ఫోటో

గురువులకు గౌరవంలో భారత్‌కు ఆరో స్థానం

లండన్‌: మెరుగైన సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిది. వారి కృషికి గుర్తింపు ఇవ్వడంతో, గౌరవించడంలో భారత్‌ ప్రపంచంలో ఆరో స్థానంలో నిలిచింది. బ్రిటన్‌కు చెందిన వార్కీ ఫౌండేషన్‌ గత వారం ప్రపంచవ్యాప్తంగా 35 దేశాల్లో ఈ అధ్యయనం నిర్వహించింది. ఇందులో భాగంగా ఒక్కో దేశంలో వెయ్యి మందిని ప్రశ్నించారు.

టీచర్లను మీరు విశ్వసిస్తున్నారా? వారు మీలో స్ఫూర్తిని నింపుతున్నారా? మీ టీచర్లు ప్రజ్ఞావంతులా? తదితర ప్రశ్నలు సంధించారు. టీచర్లకు గుర్తింపు ఇవ్వడంలో చైనా, ఘనా, సింగపూర్, కెనడా, మలేసియా, భారత్‌ దేశాలు తొలి ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఉపాధ్యాయులను గౌరవించడం మన నైతిక బాధ్యత అని వార్కీ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సన్నీ వార్కీ చెప్పారు. భారత్‌లో ప్రభుత్వం చేస్తున్న మొత్తం వ్యయంలో విద్యపై 14శాతం ఖర్చు పెడుతోంది.  రెండో స్థానంలో నిలిచిన ఘనాలో 22.1 శాతాన్ని విద్యపై వెచ్చిస్తున్నారు.

మరిన్ని వార్తలు