భారత్‌లో కరోనా: 400కు దిగువగా మరణాలు

21 Aug, 2021 10:18 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. ముందు రోజుతో పోలిస్తే కేసులు, మరణాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 13,21,205 మందికి పరీక్షలు నిర్వహించగా 34,457 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి, నిన్న ఒక్క రోజే 375 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 3.23 కోట్లు దాటాయి. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4.33 లక్షలకు చేరింది. దేశంలో ప్రస్తుతం 3,61,340 యాక్టివ్‌ కేసులు ఉ‍న్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ శనివారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

మరిన్ని వార్తలు