Corona: 45,892 కేసులు.. 817 మరణాలు

8 Jul, 2021 09:48 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్‌ వ్యాప్తి కొనసాగుతోంది. కొన్ని రోజుల నుంచి 50 వేలకు దిగువన కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 45,892 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. నిన్న కరోనాతో 817 మంది మృత్యువాత పడ్డారు. బధవారం నాడు 44,291 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4.60,704 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ గురువారం కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

ఇప్పటివరకు దేశంలో 3,07,09,557 మంది కరోనా బారినపడ్డారు. మొత్తం 4,05,028 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 2,98,43,825 మంది కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 36.48 కోట్లకుపైగా టీకా తీసుకున్నారు. నిన్న ఒక్కరోజే 33,81,671 వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.

మరిన్ని వార్తలు