‘చదువుకోని ప్రధాని దేశానికి ప్రమాదకరం’.. జైలు నుంచే దేశ ప్రజలకు లేఖ

7 Apr, 2023 11:01 IST|Sakshi

ఢిల్లీ: లిక్కర్‌ స్కాంలో అరెస్ట్‌ అయ్యి జైలులో ఉన్న మనీష్‌ సిసోడియా.. దేశ ప్రజలను ఉద్దేశించి ఓ లేఖ విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి చదువు ప్రాముఖ్యత తెలియదంటూ లేఖలో సంచలన విమర్శలు చేశారాయన. 

ఒక  దేశ ప్రధాని ఎంత తక్కువగా చదివి ఉంటే..  అది ఆ దేశానికి అంత ఎక్కువ ప్రమాదం. మోదీకి సైన్స్‌ ఏంటో అర్థం కాదు. అసలు ఆయనకు విద్య యొక్క ప్రాముఖ్యత తెలియదు కూడా అని లేఖలో సిసోడియా పేర్కొన్నారు. 

గత కొన్నేళ్లలో దేశవ్యాప్తంగా 60 వేలకుపైగా స్కూల్స్‌ మూతపడ్డాయని లేఖలో విమర్శించారాయన. చదువుకోని ప్రధానితో దేశానికి ఏనాటికైనా ప్రమాదమే అంటూ లేఖలో పేర్కొన్న సిసోడియా.. భారత దేశ ప్రగతికి చదువుకున్న ప్రధాని అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ లేఖను ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. సిసోడియా భావాలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపిన కేజ్రీవాల్‌.. ట్విటర్‌లో సందేశం ఉంచారు.  

ఇదీ చదవండి: ప్రధాని మోదీ డిగ్రీ.. మూల్యం చెల్లించుకోనున్న కేజ్రీవాల్‌

మరిన్ని వార్తలు