Jammu Kashmir: శ్రీనగర్ లో​ భారీ అగ్ని ప్రమాదం

27 Jan, 2022 14:23 IST|Sakshi

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్​లోని శ్రీనగర్​లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజ్​బాగ్​లోని ఒక వాణిజ్య భవనంలో గురువారం మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే  ఫైర్​సెఫ్టీ అధికారులకు సమాచారం అందించారు. కాగా,  ప్రమాద స్థలానికి చేరుకున్న అధికారులు ఫైరింజన్​ సహయంతో మంటలను అదుపులోనికి తీసుకొని వచ్చారు.

ఒక సిలెండర్​ పేలడం వలన మంటలు వ్యాపించినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనావేశారు. కాగా, మంటలను అదుపుచేసే క్రమంలో ఒక ఫైర్​ అధికారి గాయపడినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ముందు జాగ్రత్తగా అధికారులు ఘటన స్థలం వద్ద  అంబులెన్స్​లను సిద్ధంగా ఉంచారు.  ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. 

చదవండి: బీహార్‌లో ఆర్‌ఆర్‌బీ రిక్రూట్‌మెంట్‌ ఆందోళనలు

మరిన్ని వార్తలు