జమ్మూకశ్మీర్‌: పూంచ్‌ సెక్టార్‌లో ఎన్‌కౌంటర్‌

24 Oct, 2021 11:21 IST|Sakshi

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌: పూంచ్‌ సెక్టార్‌లో ఎన్‌కౌంటర్‌లో  జవాన్లు ఉగ్రవాదుల మధ్య పోరు కొనసాగుతోంది.  అటవీ ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదులను వేటాడేందుకు భారత సైనికులు రంగంలో దిగిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో గత 12 రోజులుగా ఆ ప్రాంతంలో కాల్పులు మోత మోగుతోంది. ఇటీవలి కాలంలో జరిగిన సుదీర్ఘమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లలో ఇది ఒకటి.  ఆ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదులు అడపాదడపా జవాన్లపై కాల్పులు జరుపుతూ దట్టమైన అటవీ ప్రాంతానికి తిరిగి వెళ్తున్నారు. దీంతో ఉగ్రవాదుల ఏరివేతకు భారత సైన్యం రంగంలోకి దిగింది. శనివారం జరిగిన ఉగ్రవాదులు కాల్పుల్లో ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. 

చదవండి: Match Box: 14 ఏళ్ల తరువాత ధర డబుల్‌ ..

మరిన్ని వార్తలు