మిసెస్‌ వరల్డ్‌గా సర్గమ్‌ కౌశల్‌.. 21 ఏళ్ల తర్వాత భారత్‌కు కిరీటం..

19 Dec, 2022 07:05 IST|Sakshi

న్యూఢిల్లీ: ముంబైకి చెందిన సర్గమ్‌ కౌశల్‌ మిసెస్‌ వరల్డ్‌ 2022 కిరీటం దక్కించుకున్నారు. శనివారం అమెరికాలోని వెస్ట్‌గేట్‌ లాస్‌వెగాస్‌ రిసార్ట్‌ అండ్‌ క్యాసినోలో జరిగిన పోటీల్లో 63 దేశాలకు చెందిన సుందరీమణులు ఈ కిరీటం కోసం తలపడ్డారు. సర్గమ్‌ విజేతగా నిలవగా మొదటి రన్నరప్‌గా మిసెస్‌ పోలినేసియా, రెండో రన్నరప్‌గా మిసెస్‌ కెనడా నిలిచారు.

2001లో నటి, మోడల్‌ అదితి గోవిత్రికర్‌ మిసెస్‌ వరల్డ్‌ గెలుచుకోగా, 21 ఏళ్ల తర్వాత తిరిగి భారత్‌కు ఆ గౌరవం దక్కింది. సర్గమ్‌ కౌశల్‌ జమ్మూకశీ్మర్‌కు చెందిన వారు. మిసెస్‌ వరల్డ్‌ పోటీలను 1984 నుంచి నిర్వహిస్తున్నారు.
చదవండి: మోరల్‌ పోలీసింగ్‌ వద్దు: సుప్రీం

మరిన్ని వార్తలు