ఎగ్జిట్‌ పోల్స్‌పై కుమారస్వామి కీలక వ్యాఖ్యలు.. కింగ్‌ మేకర్‌ కాదు.. కింగ్‌ అవుతామంటూ..

10 May, 2023 21:12 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనతాదళ్‌ సెక్యులర్‌(జేడీఎస్‌) నేత కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల ధన బలాన్ని తట్టుకోలేకపోయాం అన్నారు. తాము నిధుల కొరతతో గెలిచే 25 స్థానాల్లో వెనుకపడ్డామని చెప్పుకొచ్చారు

తాను జేడీఎస్‌ అభ్యర్థులకు ఆర్థికంగా సాయపడలేకపోయానంటూ వాపోయారు. కనీసం 120 రాకపోయినప్పటికీ మాకే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమాగా చెప్పారు. జేడీఎస్‌ మేకర్‌ కాదని కచ్చితంగా కింగ్‌ అవుతుందని నమ్మకంగా చెప్పారు. 

(చదవండి: ఎగ్జిట్‌పోల్స్‌పై సీఎం బొమ్మై రియాక్షన్‌ ఇదే..)

మరిన్ని వార్తలు