JEE Main Results 2022: జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదల.. సత్తాచాటిన తెలుగు విద్యార్థులు

8 Aug, 2022 09:25 IST|Sakshi

న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్‌ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. జేఈఈ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inలో ఫలితాలను అందుబాటులో ఉంచింది. 

జేఈఈ మెయిన్‌లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తెలుగు విద్యార్థి పి రవిశంకర్‌ ఆరో ర్యాంక్‌ సాధించగా.. హిమవంశీకి ఏడో ర్యాంక్‌, పల్లి జయలక్ష్మికి 9వ ర్యాంక్‌ వచ్చింది. కాగా ఆదివారం ర్యాంకులను విడుదల చేయకుండా కేవలం ఫైనల్‌ కీని మాత్రమే రిలీజ్‌చేసిన ఎన్‌టీఏ.. తాజాగా ర్యాంకులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

మరిన్ని వార్తలు