మంత్రి హోదాలో ఉండి.. సాదాసీదాగా కూతురు పెళ్లి 

8 Dec, 2021 14:54 IST|Sakshi

సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి భయాల నేపథ్యంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవ్హాడ్‌ తన కూతురి వివాహాన్ని సాదాసీదాగా జరిపించి ఆదర్శంగా నిలిచారు. మంగళవారం ఆయన తన కూతురు నతాషా అవ్హాడ్‌కు రిజిస్టర్‌ వివాహం జరిపించారు. ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా జరిగిన ఈ పెళ్లికి కేవలం ఆయన కుటుంబ సభ్యులు, కొందరు ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. మంత్రి హోదాలో ఉండి కూడా తన ఏకైక కూతురి వివాహాన్ని నిరాడంబరంగా జరిపించిన మంత్రి జితేంద్ర అవ్హాడ్‌ను ఈ సందర్భంగా పలువురు అభినందించారు. 

చదవండి: (కనీస మద్దతు ధరపై జేపీసీ ఏర్పాటు చేయాలి: ఎంపీ విజయసాయిరెడ్డి)

మరిన్ని వార్తలు