అనారోగ్యంతో ఆస్పత్రిలో శిబు సోరెన్‌

11 Feb, 2023 06:02 IST|Sakshi

రాంచీ: జార్ఖండ్‌ ముక్తి మోర్చా(జేఎంఎం) చీఫ్‌ శిబు సోరెన్‌(79) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు జరిపి శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌ను గుర్తించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సోరెన్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్స కొనసాగుతోందని ఆయన కుమారుడు జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ ట్వీట్‌ చేశారు.

2005–10 మధ్య సోరెన్‌ జార్ఖండ్‌ సీఎంగా పనిచేశారు. లోక్‌సభకు 8 పర్యాయాలు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.

>
మరిన్ని వార్తలు