సాక్షి, బెంగళూరు: పెంపుడు కుక్కలను యజమానులు రోడ్ల మీద, పార్కులకు, చెరువు గట్లకు వాకింగ్కు తీసుకెళ్లడం, అవి ఇతరుల మీద పడి కరవడం, ఆ తరువాత గొడవలు జరగడం వంటివి తరచూ సంభవిస్తున్నాయి. ఈ తరహా గొడవలకు అడ్డుకట్ట వేసేలా బెంగళూరు పాలికె కొత్తగా 7 నిబంధనలను జారీచేసింది.
ఈ నిబంధనలు తప్పనిసరి..
వాగ్వాదాలు పెరగడం వల్లనే..
నగరంలో శునకాలను పెంచుకోవడం ప్రతిష్టకు చిహ్నంగా మారింది. ఎంత ఖరీదైన కుక్క ఉంటే అంత గొప్పగా భావిస్తారు. తమతో పాటు వాకింగ్కు వెంట కుక్కలను తీసుకెళ్లడం ఫ్యాషన్గా మారింది. అనేక ఏళ్లు నుంచి ప్రజలు, పెంపుడు కుక్కల యజమానుల మధ్య గొడవలు ఏర్పడుతున్నాయి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని బీబీఎంపీ కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చింది.
చదవండి: Chennai: అదే జరిగితే మరో 80 ఏళ్లలో చెన్నై, తూత్తుకుడి..