మంత్రి ఫైర్‌: రాస్కెల్, ఎగిరి తంతా!

8 Jan, 2021 10:09 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి మాధుస్వామి   

ఇంజనీర్‌పై మంత్రి నిప్పులు

సాక్షి, బెంగళూరు: అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని మంత్రి జేసీ మాదుస్వామి అధికారులను హెచ్చరించారు. గురువారం జిల్లా పంచాయతీ సమావేశం హాల్లో అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... టెండర్లు పిలిచినా ఎందుకు జాప్యం చేస్తున్నారని జెడ్పీ ఇంజినీర్‌ రంగస్వామిపై తీవ్రంగా మండిపడ్డారు. టెండర్‌ పిలిచి కాంట్రాక్టర్‌కు పనులను  అప్పగించాలని నేను 4వ తేదీన చెప్పినా కూడా ఇప్పటివరకు ఏం చేస్తున్నావు? రాస్కెల్, ఎగిరి తంతే ఎక్కడ పడతావో తెలుసా? పని చేయకుండా గాడిదలు కాస్తున్నావా అని మంత్రి అగ్గిమీద గుగ్గిలం కావడంతో అధికారులు కంగుతిన్నారు. పనిచేయని వాళ్లను ఇంటికి పంపించాలని జెడ్పీ సీఈఓకు మంత్రి స్పష్టంచేశారు. చదవండి: (చిక్కుల్లో నటి రాధికా కుమారస్వామి)

>
మరిన్ని వార్తలు