కర్ణాటకలో ఏడు ఏవై.4.2 కరోనా కేసులు

28 Oct, 2021 06:09 IST|Sakshi

బెంగుళూరు:  కరోనాలో కొత్త రకం ఏవై.4.2 కేసుల సంఖ్య కర్ణాటకలో ఏడుకి చేరుకుంది. డెల్టా ప్లస్‌ నుంచి రూపాంతరం చెంది కొత్తగా పుట్టుకొచ్చిన ఈ కొత్త రకం కేసులు మొట్టమొదటి సారిగా యూకేలో వెలుగులోకి వచ్చాయి. భారత్‌లోనూ ఈ కొత్త వేరియెంట్‌ కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో ఇప్పటిదాకా ఏడు కేసులు నమోదైనట్టుగా రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ రణ్‌దీప్‌ వెల్లడించారు. ఈ కొత్త వేరియెంట్‌తో ఎలాంటి మరణాలు సంభవించలేదని, కొంతమంది ఆస్పత్రి పాలయ్యారని తెలిపారు. 

మరిన్ని వార్తలు