లాక్‌డౌన్‌ ఆలోచనే లేదు 

23 Mar, 2021 06:03 IST|Sakshi

ఆరోగ్యమంత్రి సుధాకర్‌

సాక్షి, కర్ణాటక : కరోనా కట్టడికి లాక్‌డౌన్, సెమిలాక్‌డౌన్‌ విధించే యోచన లేదని ఆరోగ్య మంత్రి సుధాకర్‌ తెలిపారు. సోమవారం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ లాక్‌డౌన్, సెమిలాక్‌డౌన్‌ అన్ని ఊహాగానాలే, ప్రజలు ఇటువంటి వార్తలను నమ్మరాదన్నారు. కోవిడ్‌ సెంటర్లను ఈ వారంలో ప్రారంభిస్తామని చెప్పారు. కాగా, మాస్కు ధరించకపోతే రూ.250 జరిమానా విధిస్తామని మంత్రి తెలిపారు. కోవిడ్‌ నిబంధనల్ని తప్పక పాటించాలన్నారు. పెళ్లిళ్లు, వేడుకల్లో ఎక్కువమంది చేరకుండా చూస్తామని, అక్కడ పర్యవేక్షణకు మార్షల్స్‌ను నియమిస్తామని తెలిపారు.    

మరిన్ని వార్తలు