ఇద్దరితో యువకుడి ప్రేమ.. వధువు కోసం లాటరీ!

6 Sep, 2021 12:39 IST|Sakshi

బెంగళూరు: ఈ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీలోని ట్విస్టులు సినిమాల్లో కూడా చూసుండరేమో. కొద్ది నెలలుగా కొనసాగిన ఈ ప్రేమ కథకు లాటరీ పద్ధతి శుభం కార్డు పడేలా చేసింది. ఈ వింత ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హసన్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లో​కి వెళితే.. సకలేశపుర ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఇద్దరు యువతులతో ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం కొనసాగించాడు.

చివరికి ఈ ట్రయాంగిల్‌ స్టోరీ ఆ యువతులకు తెలిసినా అతన్నే పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు. దీంతో ఈ పంచాయితీ కాస్త పెద్దలకు ముందుకు వెళ్లింది. పంచాయితీలోనూ ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఇదే సమయంలో ఓ యువతి.. అతడు లేని జీవితం తనకు వద్దని చెప్పి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గ్రామస్థులు సకాలంలో స్పందించి ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడింది. చికిత్స అనంతరం కోలుకుని ఆమె ఇటీవలే గ్రామానికి తిరిగి వచ్చింది.

దీంతో తాజాగా మరోసారి ఈ వ్యవహారంపై పంచాయతీ జరగగా, గ్రామస్థులు ఓ పరిష్కారాన్ని సూచిస్తూ.. లాటరీ పద్ధతి ద్వారా ఒకరిని ఎంపిక చేస్తామని యువతులకు చెప్పారు. ఇద్దరు ఓకే చెప్పడంతో లాటరీ తీయగా, విషం తాగిన అమ్మాయి పేరే వచ్చింది. దీంతో అదే రోజు అమెతో వివాహం జరిపించారు.

చదవండి: లేడీస్‌ హాస్టల్‌లోకి ప్రవేశించి యువతిపై అత్యాచారం

మరిన్ని వార్తలు