ఏలూరుకు రానున్న కేంద్ర బృందం

7 Dec, 2020 14:26 IST|Sakshi

న్యూఢిల్లీ: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు మంగళవారం కేంద్ర బృందం రానుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ముగ్గురు ఎయిమ్స్‌ అధికారుల బృందాన్ని ఏలూరు పంపుతున్నాము. కేంద్ర బృందం రేపు ఏలూరుకు చేరుకుంటుంది. విచిత్ర వ్యాధితో జనం భయపడిపోతున్నారు. రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తాం' అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.
చదవండి:  (ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో సీఎం జగన్)‌

మరిన్ని వార్తలు