ప్రధాని మోదీతో కొండా విశ్వేశ్వర్‌ దంపతుల భేటీ 

19 Nov, 2022 09:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి దంపతులు ప్రధాని నరేంద్రమోదీతో శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. త్వరలో జరగనున్న తమ రెండో కుమారుడి వివాహానికి ఆహ్వానించడానికి ప్రధానిని కలిశామని కొండా దంపతులు వెల్లడించారు. 

అంతేకాకుండా జాతీయ, అంతర్జాతీయ అంశాలను ప్రధానితో చర్చించినట్లు విశ్వేశ్వర్‌రెడ్డి భార్య సంగీతరెడ్డి ట్వీట్‌లో తెలిపారు. తెలంగాణలో విద్య, వైద్యం, ఇతర విషయాల గురించి చర్చించామని విశ్వేశ్వర్‌రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు. తమ స్వచ్ఛ్‌ ట్రక్, బయోగ్యాస్‌ ప్రాజెక్టుల గురించి మోదీకి వివరించామన్నారు. 


 

మరిన్ని వార్తలు