Krishna Water Dispute: సీజేఐ కీలక నిర్ణయం

4 Aug, 2021 11:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాల వివాద అంశంపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా... న్యాయపరంగా సమస్య పరిష్కారం కోరుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది, భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు తెలిపారు. ఈ క్రమంలో సీజేఐ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించాలని కేంద్రం కోరగా.. చీఫ్‌ జస్టిస్‌ రమణ అందుకు నిరాకరించారు. కేసును వేరే ధర్మాసనానికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కృష్ణా జలాల్లో తెలంగాణ వైఖరిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఏపీకి దక్కాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందని సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది.

మరిన్ని వార్తలు