Army Vehicle Accident In Ladakh: లడఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు జవాన్లు మృతి

27 May, 2022 17:06 IST|Sakshi

శ్రీనగర్‌: లడఖ్‌లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భారత జ‌వాన్లు ప్ర‌యాణిస్తున్న ఆర్మీ వాహ‌నం అదుపు త‌ప్పి టుర్టుక్ సెక్టార్ వద్ద ష్యోక్ న‌దిలో ప‌డిపోయిన ఘటనలో ఏడుగురు జవాన్లు ప్రాణాలో కోల్పోయారు. మరో 19 సైనికులకు తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను ఎయిర్‌ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయ‌ప‌డిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్న‌ట్లు ఆర్మీ పేర్కొంది.  26 మంది సైనికుల బృందం పార్తాపూర్‌లోని ట్రాన్సిట్ క్యాంప్ నుండి సబ్ సెక్టార్ హనీఫ్‌లోని ఒక ఫార్వర్డ్ లొకేషన్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
చదవండి: లైంగిక ఆరోపణలు.. మన‌స్తాపంతో మాజీ మంత్రి ఆత్మహత్య

మరిన్ని వార్తలు