చితక్కొడుతున్న మహిళలు : హోలీ ఇలా కూడా

24 Mar, 2021 11:38 IST|Sakshi

యూపీలో హోలీ సంబరాలు : లాఠీమార్‌ వేడుకలో వేలాది మహిళలు

తరతరాలుగా వస్తున్న సంప్రదాయం

సాక్షి,లక్నో : ఉత్తరప్రదేశ్‌లో రంగుల పండుగ హోలీ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఒకవైపు దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి  పంజా విసురుతున్న తరుణంలో  యూపీ మథుర జిల్లాలో హోళీ సంబరాలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి.  ఈ  క్రమంలో లడ్డూమార్‌ హోలీ సంబరాలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేసింది. కరోనా మార్గనిర్దేశనాలను పాటించకుండా వేలాదిమంది ఈ సంబరాల్లో సందడి చేయడం వివాదం  రేపింది. అయితే తాజాగా లాఠ్‌మార్‌ హోలీ సంబరాలు వార్తల్లో నిలిచాయి.. రంగులు జల్లుకుంటూ ఆడుకోవడంతోపాటు ఆడవారు మగవారిని కర్రలతో కొట్టడం ఈ లాఠీమార్‌ హోలీ ప్రత్యేకత. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన వీడియో  నెట్టింట చక్కర్లుకొడుతోంది.  

దేశవ్యాప్తంగా మార్చి 29న హోలీ వేడుక జరుపుకోనుండగా యూపీలో మధుర-బృందావన్-బర్సానాలో వారం ముందుగానే ఈ సంబరం ప్రారంభమవుతుంది. ప్రపంచ ప్రఖ్యాత లాఠీమార్‌ హోలీ మంగళవారం నిర్వహించారు. రెండు రోజులపాటు ఈ వేడుకను నిర్వహిస్తారు. మంగళవారం బర్సానాలో నిర్వహించగా, బుధవారం బర్సానా, నందగావ్‌లో హోలీ ఆడనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. శ్రీకృష్ణుడు గోపికలతో హోలీ ఆడుతుండగా, ప్రతిగా రాధ తదితరులు కృష్ణుడ్ని లాఠీలతోనూ, కర్రలతోనూ కొడతారట. ఈ లాఠీమార్‌  దాడినుంచి తప్పించుకునేందుకు  పురుషులు కవచాలను కూడా ధరిస్తారట. 

మరోవైపు ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కమెంట్లతో సందడి చేస్తున్నారు. కరోనా విస్తరిస్తోంటే...కనీస  జాగ్రత్తలు పాటించడంలేదుని, మాస్క్‌లు పెట్టుకోకుండా, భౌతిక దూరం పాటించడం లేదంటూ మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు